న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర క్యాబినెట్లో భారీ మార్పులే చేశారు. 43 మందిని కొత్తగా క్యాబినెట్లోకి తీసుకున్న మోదీ.. క్యాబినెట్లో వివిధ మంత్రులకు శాఖలు కేటాయించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాకు అదనంగా సహకార శాఖను కేటాయించారు.
కీలకమైన మంత్రిత్వశాఖలకు కొత్త వారికి, సహాయ మంత్రులకు కేటాయించారు. ఐటీ రంగంతోపాటు రైల్వేశాఖ, ఆరోగ్యం, న్యాయశాఖల బాధ్యతలను కొత్త వారికి అప్పగించారు.
ఇప్పటివరకు రైల్వే, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ను చేనేత, జౌళిక శాఖకు బదిలీ చేశారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ను విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా నియమించారు.
గుజరాత్కు చెందిన మాన్సుఖ్ మాండవియాను ఆరోగ్యశాఖ సహాయ మంత్రిగా నియమించారు. అయితే, స్వతంత్ర హోదా కల్పించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు పౌర విమానయాన శాఖ కేటాయించారు.
ఇప్పటివరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ పూరీకి క్యాబినెట్ హోదా కల్పించిన సంగతి తెలిసిందే. ఆయనకు పెట్రోలియం- హౌస్ డెవలప్మెంట్ శాఖ కేటాయించారు.
కొత్త రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ నియమితులయ్యారు. ఆయనకే ఐటీ వ్యవహారాలు అప్పగించారు. స్మ్రుతి ఇరానీకి మహిళా శిశు సంక్షేమశాఖను యధావిధిగా కొనసాగించారు.
ఆర్థిక శాఖ సహాయ మంత్రి హోదా నుంచి కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన అనురాగ్ సింగ్ ఠాకూర్కు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అప్పగించారు. ఢిల్లీకి చెందిన మీనాక్షి లేఖికి విదేశాంగ, సాంస్క్రుతిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
గుజరాత్ నుంచి నియమితులైన మరో మంత్రి పురుషోత్తం రూపాలకు పాడి, మత్య్సశాఖను కేటాయించారు. ఇప్పటివరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన భూపేంద్ర యాదవ్కు కార్మికశాఖ కట్టబెట్టారు. గిరిరాజ్ సింగ్కు గ్రామీణాభివ్రుద్ధి శాఖను కేటాయించారు.
బీహార్లోని లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత పశుపతి కుమార్ పరాస్కు.. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను కేటాయించారు. ఇంతకుముందు ఆయన సోదరుడు, రాం విలాస్ పాశ్వాన్ ఆహార వ్యవహారాల శాఖను నిర్వహించిన సంగతి తెలిసిందే.
కిషన్ రెడ్డి- పర్యాటక శాఖ, సాంస్క్రుతిక, ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధి
నారాయణ రాణె- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
పీయూష్ గోయల్- చేనేత, జౌళి శాఖ
కిరణ్ రిజిజు- న్యాయ శాఖ
అనురాగ్ సింగ్ఠాకూర్- క్రీడలు, యువజన సర్వీసులు, సమాచార శాఖ
భూపేంద్ర యాదవ్- కార్మిక, పర్యావరణ వ్యవహారాలు
శర్బానంద సోనోవాల్- ఆయుష్ మంత్రిత్వశాఖ