యాదాద్రి, మార్చి23: యాదాద్రీశుడికి నిత్యారాధనలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. మంగ ళవారం వేకువజామునే బాలాలయంలో కవచమూర్తులకు ఆరాధనలు జరిపి, పంచామృతాలతో నిజాభిషేకం నిర్వ హించి, తులసి అర్చనలు జరిపారు. అమ్మవారికి కుంకు మార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతా ల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో క్షేత్ర పాల కుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టా రు. ఈ క్షేత్రానికి పాలకుడిగా చెంత గల గుడిలో హనుమం తుడిని సిందూరంతో అలంకరించి అభిషేకించారు. తమల పాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నా రు. తమలపాకులతో అర్చన, లలితాపారాయణం చేశారు. స్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవే ద్యంగా సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
స్వామిని దర్శించుకున్న సమాచార ముఖ్య కమిషనర్
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ బుద్ధ మురళి కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు స్వామి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
ఖజానాకు రూ. 11,17,602 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఖజానాకు రూ. 11,17,602 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 35,924, బ్ర హ్మోత్సవ కల్యాణం ద్వారా రూ. 3,07,500, రూ. 100 దర్శనాలతో రూ. 21,000, సుప్రభాతంతో రూ. 500, ప్రచారశాఖ ద్వారా రూ. 180, క్యారీబ్యాగులతో రూ. 2, 200, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ. 30,000, కల్యాణ కట్టతో రూ. 19,080, ప్రసాద విక్రయాలతో రూ. 4,38, 350, శాశ్వత పూజలతో రూ. 52,116, వాహన పూజల తో రూ. 5,600, టోల్గేట్ ద్వారా రూ. 740, అన్నదాన విరాళంతో రూ. 34,970, సువర్ణ పుష్పార్చనతో రూ. 74, 324, యాదరుషి నిలయంతో రూ. 50,300, పుష్కరిణి తో రూ. 850, శివాలయం ద్వారా రూ. 1,432, పాతగుట్ట తో రూ. 17,520, ఇతర విభాగాలతో రూ. 25,016తో కలిపి స్వామివారికి రూ.11,17,602 ఆదా యం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు.