తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో కాంగ్రెస్ను ఇరుకునపెట్టే పరిణామం చోటుచేసుకున్నది. తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ ఆదివారం రాజీనామా చేశారు. తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయం ముందు కూర్చుని గుండు గీయించుకొని నిరసన వ్యక్తం చేశారు.