వాషింగ్టన్ : సెప్టెంటర్ 11 నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యం పూర్తిగా వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటన వేగంగా అమలవుతున్నది. ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 44 శాతం బలగాల ఉపసంహరణ పూర్తి చేసినట్లు సెంట్రల్ కమాండ్ (సెన్కామ్) తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జో బైడెన్ ఆఫ్ఘనిస్తాన్లో రెండు దశాబ్దాల సుదీర్ఘ యుద్ధం ముగిసినట్లుగా ప్రకటించారు. దాంతో అక్కడి నుంచి యూఎస్ బలగాలతో పాటు నాటో దశాలు వెనక్కి తిరిగి వస్తున్నాయి.
అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 300 సీ-17 కార్గో, 13,000 సైనిక పరికరాలను డిఫెన్స్ లాజిస్టిక్స్ ఏజెన్సీకి అప్పగించినట్లు చెప్పారు. 2001 సెప్టెంబర్ 11 న అమెరికాలో దాడి అనంతరం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాదులను నిర్మూలించే ఆపరేషన్ ప్రారంభించారు. అమెరికాతో పాటు నాటో దేశాల సైన్యాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 2,400 మంది అమెరికన్ పౌరులు మరణించారు.
అమెరికా అధికారికంగా 6 సంస్థలను ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు అప్పగించింది. ఈ సమాచారాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపంది. 2020 ఫిబ్రవరి 29 న దోహాలో తాలిబాన్-యూఎస్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సైన్యం ఉపసంహరణ చేపడుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధంలో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్లో శాంతి పునరుద్ధరించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం 2,500 మంది అమెరికన్ సైనికులు మాత్రమే మిగిలి ఉన్నారు.
శ్రీలంక తీరంలో మునిగిన ఇంధనం కార్గో షిప్
జమ్ములో మళ్లీ పాకిస్తాన్ కాల్పులు..!
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం చెల్లిస్తాం..
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..