నల్లబెల్లి, ఏప్రిల్ 9 : మండలంలోని బొల్లోనిపల్లి గ్రామంలో రెండేళ్లకోసారి నిర్వహించే బద్ధిపోచమ్మ బోనాల జాతర శుక్రవారం కనులపండువగా జరిగింది. గ్రామం నుంచి ఉదయం ఆరు గంటలకు సుమారు వెయ్యిమంది మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ మధ్యాహ్నం 12 గంటలకు పోశంపల్లిలోని అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. పోచమ్మకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సంతానం లేనివారు ఆలయ ప్రాంగణంలో వరాలు పట్టారు. భక్తులు మొక్కుల సమర్పణలో భాగంగా ఏర్పా టు చేసిన ప్రభబండ్లు జాతరలో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఎస్సై బండారు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు భక్తులకు మాస్కులు పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమ్మవారికి పట్టువస్ర్తాల సమర్పణ
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సతీమణి జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీత, వైస్ ఎంపీపీ గందె శ్రీలత బద్ధిపోచమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్పీ ఫ్లోర్లీడర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి దీవెన లు ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల్లో ఎంపీటీసీ బోళ్ల శ్రీలత, టీఆర్ఎస్ నాయకులు వర్ణం నర్సింహారెడ్డి, రమేశ్ పాలొన్నారు.
ఇవి కూడా చదవండి..
అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
వారం రోజుల్లోనే పవర్ స్టార్ సినిమా OTTలో విడుదల..