టాలీవుడ్లో కరోనా వలన అయితేనేమి, ఇతరత్రా సమస్యల వలన అయితేనేమి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు.ఈమె కూడా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేశ్వరరావు- అనితల కుమార్తె స్వాతి గతంలో జనియర్ ఎన్టీఆర్ నటించిన రామాయణం మూవీలో రావణుడిగా నటించి అలరించింది. అయితే అనిత అకాల మరణంపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..