చండీగఢ్: హర్యానాలో మహిళా రైతుల నేతృత్వంలో ‘తిరంగా ట్రాక్టర్ పరేడ్’ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉత్తరాది రాష్ట్రాల రైతులు గత తొమ్మిది నెలలుగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్యానాలోని ఉచన కలాన్లో రైతులు ‘తిరంగా ట్రాక్టర్ పరేడ్’ చేపట్టారు. ఈ ట్రాక్టర్ పరేడ్కు మహిళా రైతులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను కూడా మహిళా రైతు ఎగురవేశారు. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం నుంచి వెనక్కి తగ్గబోమని రైతులు స్పష్టం చేశారు.