చండీగఢ్: హర్యానా హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ (68) ఆదివారం చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ దవాఖానలో చేరారు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన దవాఖానలో అడ్మిట్ అయ్యారు. అనారోగ్య కారణాల రీత్యా రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కూడా హాజరు కాలేదు. ఆయనకు పల్మనరీ, శ్వాసకోశ సంబంధ వైద్య నిపుణులతో కూడిన వైద్యుల టీం చికిత్స అందిస్తున్నదని అనిల్ విజ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
గతవారం సీఎం మనోహర్లాల్ ఖట్టర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రోహ్తక్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సీఎంతో కలిసి హెలికాప్టర్లో వచ్చినప్పటి నుంచి ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. గతేడాది కోవిడ్-19 బారీన పడ్డ అనిల్ విజ్ సుమారు నెల రోజుల పాటు దవాఖానలో చికిత్స పొందారు.