దుబాయ్ (యూఏఈ): ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా జూన్ 2న బ్రిటన్కు బయలుదేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ తుదిపోరు జరుగనుంది. ఇందుకోసం జూన్ 2న కోహ్లీసేన ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ చేరుకొని హాంప్షైర్ బౌల్లో ఏర్పాటు చేసిన బయోబబుల్లో క్వారంటైన్లో ఉండనుందని ఐసీసీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే జూన్ 15న న్యూజిలాండ్ ఈ బబుల్లోకి వస్తుందని తెలిపింది. టీమ్ఇండియా పర్యటన కోసం బ్రిటన్ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిందని వెల్లడించింది. మరోవైపు అతిథ్య జట్టుతో టెస్టు సిరీస్ ఆడేందుకు ఇప్పటికే ఇంగ్లండ్లో ఈసీబీ ఏర్పాటు చేసిన బయోబబుల్లో న్యూజిలాండ్ ఉంది.