న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలామటుకు తగ్గిపోయింది. దాంతో వివిధ రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేశారు. కానీ హర్యానా ప్రభుత్వం మాత్రం మరో వారంపాటు లాక్డౌన్ను పొడిగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు హర్యానా వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే, లాక్డౌన్ గడువును వారం రోజులు పొడిగించినప్పటికీ, లాక్డౌన్ నిబంధనల్లో మాత్రం మరికొన్ని వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపింది. మునుపటి నిబంధనల్లో కొన్నింటిని సడలించినట్లు వెల్లడించింది.