నిడమనూరు, ఏప్రిల్ 8 : విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్తో కలిసి గురువారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు నీరాజనం పలికారు. ఉదయం 8గంటలకు ఊట్కూరులో మహిళలు బతుకమ్మలతో ఎదురేగి స్వాగతం పలికారు. యువకులు, మహిళలు కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలతో మంత్రులకు ఘన స్వాగతం పలకడంతో పల్లెలన్నీ సందడిగా మారాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సావధానంగా వివరిస్తూ సాగిన మంత్రి ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి ప్రజలను విస్మరించిన తీరుపై అంశాల వారీగా వివరిస్తుండగా.. అందుకు ప్రజలు స్పందించి చేసిన నినాదాలు ఉత్సాహాన్నిచ్చాయి. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మిర్యాలగూడ, కోదాడ, నకిరేకల్ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, నాయకులు మన్నెం రంజిత్ యాదవ్, కట్టెబోయిన గురవయ్య యాదవ్, కేవీ రామారావు, అల్వాల కళావతి, సర్పంచులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనే చేనేతలకు మంచి రోజులు…
తెలంగాణ ప్రభుత్వంతోనే చేనేత కార్మికులకు మంచి రోజులు వచ్చాయని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర మల్లేశం అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పద్మశాలీల కోసం కోకాపేటలో రెండున్నర ఎకరాల భూమితో పాటు రూ.5కోట్లు కేటాయించారని తెలిపారు. పద్మశాలీల కోసం భవనం నిర్మించుకున్నామన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పద్మశాలీలు ఐక్యంగా వుండి నోముల భగత్కు ఓటు వేయాలని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, జెల్లా నరేందర్, కొలను సత్యనారాయణ, సోమ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి అండగా ఉందాం
అబివృద్ధి చేసే టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి, నాగార్జున సాగర్ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. మండలంలోని వెంకటాపురం(ఎస్), సుల్తాన్పురం, పాశంవారిగూడెం గ్రామాల్లో గురువారం ఆయన సైకిల్పై తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ బలపర్చిన అభ్యర్థి నోముల భగత్కు ఓటు వేయాలన్నారు. ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్రెడ్డి, సర్పంచ్లు బచ్చనబోయిన రేణుకాశ్రీనివాస్, వాడపల్లి రంగమ్మ చంద్రమౌళి, పాశం అలివేలమ్మ, కంచర్ల విజయేందర్రెడ్డి, శ్రీవాణి, ఐతరాజు ముత్తమ్మ పాల్గొన్నారు.
భగత్ గెలుపునకు మైనార్టీలు కలిసిరావాలి: హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
టీఆర్ఎస్ పాలనలోనే నందికొండ మున్సిపాలిటీగా ఆవిర్భవించి గుర్తింపు దక్కిందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నందికొండ అభివృద్ధికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ విజయానికి మైనార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు. గురువారం రాత్రి హిల్కాలనీలో, పైలాన్కాలనీలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదని, రాష్ట్ర ఏర్పాటుతోనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్కు మద్దతుగా నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నందికొండ ఎన్నికల ఇన్చార్జులు కరీంనగర్ మేయర్ యాదగిరిసునీల్రావు, సుడా చైర్మన్ జీవీ.రామకృష్ణారావు, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, కర్న బ్రహ్మానందరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ మసీయుల్లా ఖాన్, మైనార్టీ చైర్పర్సన్ అర్షద్ అలీఖాన్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, వైస్ చైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్లు రమేశ్జీ, నిమ్మల ఇందిర పాల్గొన్నారు.
గులాబీ వెంటే గిరిజనం
మండలంలోని జాల్తండా, జమ్మనకోట, నాగార్జునపేట, ఎర్రచెర్వుతండాల్లో వివిధ పార్టీలకు చెందిన 500మంది గురువారం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, దేవరకొండ ఎమ్మెల్యే, మండల ఎన్నికల ఇన్చార్జి రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధికే మా ఓటు..
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన టీఆర్ఎస్తోనే మేమంతా ఉంటామని లచ్యాతండా వాసులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కు ఓటేస్తామని తెలిపారు. సర్పంచ్ మంగ్తానాయక్, ఉపసర్పంచ్ రవి, మాజీ ఎంపీటీసీ పర్షానాయక్, పార్టీ గ్రామ అధ్యక్షుడు రవినాయక్, యూత్ నాయకులు చంటి, హర్జా, లాల్సింగ్ పాల్గొన్నారు.
గొర్రెపిల్ల బహూకరణ
టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్కు గోవిందన్నగూడెం యాదవులు గొర్రెపిల్లను బహూకరించారు. ప్రచారంలో భాగంగా గ్రామానికి రాగా.. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన గొర్రెల కాపరులు కృతజ్ఞతా పూర్వకంగా అందించారు.
ఎర్రటెండాలోనూ నీరాజనం
రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు