న్యూఢిల్లీ : తాను ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారం నిరాధారమని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు. కాషాయ పార్టీ ఇలాంటి అవాస్తవాలను ప్రచారంలో పెడుతోందని బీజేపీపై ఆయన మండిపడ్డారు.
గుజరాత్ లో కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. తాను ఆప్ లో చేరతానని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీఎం అభ్యర్ధిగా ముందుకొస్తానని మీడియా కధనాలను చూసి కంగుతిన్నానని చెప్పారు. బీజేపీ దురుద్దేశంతోనే ఈ ప్రచారాన్ని నడిపిస్తోందని హార్ధిక్ పటేల్ ట్వీట్ చేశారు.