మధ్యప్రదేశ్లో దారుణం
భోపాల్: చేతబడి చేస్తున్నదన్న అనుమానంతో నలుగురు వ్యక్తులు ఓ మహిళను దుస్తులు చించేసి దారుణంగా కొట్టారు. తర్వాత నగ్నంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అడ్డొచ్చిన కొందరు గ్రామస్థులపైనా దాడి చేశారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని మాండ్వి గ్రామంలో ఈ నెల 5న చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. దీంతో పోలీసులు ఆ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ముగ్గుర్ని అరెస్ట్ చేయగా ఒకడు పరారీలో ఉన్నాడు.