బైక్ టైర్లు మెడలో వేసి బలవంతంగా నృత్యాలు
ధర్, సెప్టెంబర్ 22: ఇంట్లో నుంచి పారిపోయిన అమ్మాయి (19), అబ్బాయి (21) మెడలో ద్విచక్రవాహన టైర్లు వేసి పబ్లిక్లో డ్యాన్స్ చేయించడంతోపాటు వారిని చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లాలో చోటుచేసుకున్నది. యువజంట పారిపోయేందుకు సహకరించిందని 13 ఏండ్ల బాలికను సైతం ఇదే తరహాలో హింసించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం
గాలిస్తున్నారు.