ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 29: ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లికి చెదిన పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను సర్పంచ్ సావిత్రి రవీందర్గౌడ్, ఎంపీటీసీలు స్థానిక నాయకులతో కలిసి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చెక్కులను అందజేయడం హర్షణీయమని అన్నారు. ఎమ్మెల్యే షకీల్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు వెంకయ్యగారి రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవీందర్నాయక్, వీఆర్ఏ అశోక్, ఉప సర్పంచ్ మహేశ్గౌడ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ సాయన్న, నాయకులు శ్రీనివాస్రెడ్డి, నరేందర్ రెడ్డి, అహ్మద్, పాండు తదితరులు పాల్గొన్నారు.
అమీనాపూర్, కోమన్పల్లి గ్రామాల్లో..
వేల్పూర్, ఏప్రిల్ 29: మండలంలోని అమీనాపూర్, కొమన్పల్లి గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయా గ్రామాల సర్పంచులు అందజేశారు. ఈ సందర్భంగా కొమన్పల్లి సర్పంచ్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నదని అన్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పిప్రిలో..
ఆర్మూర్, ఏప్రిల్ 29 : మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపీ పస్క నర్సయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా చెక్కులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే జీవన్రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటించాలని, 45 ఏండ్లు పైబడిన వారు టీకాలు వేయించుకోవాలని ప్రజాప్రతినిధులు, నాయకులు సూచించారు. పిప్రి సర్పంచ్ అసపురం దేవీరెడ్డి, విండో చైర్మన్ సోమ హేమంత్రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సామెర సురేశ్ గ్రామస్తులు పాల్గొన్నారు.