బెంగళూరు: హంసా న్యూ జనరేషన్ (ఎన్యూ) విమానం శుక్రవారం తొలిసారి నింగిలోకి ఎగిరింది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయం నుంచి తొలి టెస్ట్ ఫ్లైట్ను విజయవంతం చేసింది. 4000 అడుగుల ఎత్తులో ఎగురడంతోపాటు 80 నాట్ల వేగాన్ని అందుకున్నది. అనంతరం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. హంసా న్యూ జనరేషన్ విమానాన్ని CSIR-NAL సంయుక్తంగా రూపొందించి అభివృద్ధి చేశాయి.