మంచిర్యాలటౌన్ / చెన్నూర్ /దహెగాం/ కౌటాల / కాగజ్నగర్ టౌన్, మార్చి 21: రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. మంచిర్యాల పట్టణంలో ఆదివారం టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఐబీ చౌరస్తాలో నిర్వహించిన ఈ సంబురాల్లో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలకు ఈ తీర్పు చెంపపెట్టు అని అన్నారు. తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ను ఇంటి పార్టీగా భావించి అన్ని సందర్భాల్లో అక్కున చేర్చుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, నాయకులు అత్తి సరోజ, హరికృష్ణ, తోట తిరుపతి, సురేశ్ బల్దవా, పోరెడ్డిరాజు, మినాజ్, గౌస్, చంద్రశేఖర్ హండే, గొంగళ్ల శంకర్, టీఆర్ఎస్ యూత్ నాయకులు గోగుల రవీందర్రెడ్డి, గడప రాకేశ్, సోహైల్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట శనివారం అర్ధరాత్రి పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయిని సతీశ్, అఖిల్ అహ్మద్, అట్టెం రాజబాపు, నిమ్మల సంతోష్, షఫీ, మహేందర్, తాటికొండ సురేశ్, ఖాజా ఖంరొద్దీన్ పాల్గొన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్సీలుగా సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించడం సీఎం కేసీఆర్ సుపరిపాలకు నిదర్శమంటూ పటాకులు కాల్చి మిఠాయిలు పంచారు. జై టీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంబగౌని సంతోష్గౌడ్, నాయకలు ప్రసాద్రాజ్, దందెర వెంకన్న, నజీర్, కాసారపు నాగేశ్వర్గౌడ్, కోండ్ర మహేశ్గౌడ్, పోతుగంటి భీమన్న, అంజన్న పాల్గొన్నారు. కౌటాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, సర్పంచ్ వొజ్జల మౌనిశ్, కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్ అలీ, మొగఢ్దగఢ్ ఎంపీటీసీ బొమ్మకంటి మనీశ్, ఉపసర్పంచ్ పసునూరి తిరుపతి, నాయకులు శ్రీనివాస్, సంతోష్, రవీందర్ గౌడ్, అశోక్, ఆత్మారాం, ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. కాగజ్నగర్లో ఎమ్మెల్యే నివాసం నుంచి బైక్లతో ప్రధాన వీధుల గుండా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్గాంధీ చౌరస్తాకు చేరుకున్నారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.