శ్రీనగర్ : హంద్వారా పోలీసులు, 21 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది ఉత్తర కశ్మీర్లోని బాదర్కలి అటవీప్రాంతంలో మంగళవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా సెర్చ్ పార్టీని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఐదుగురి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు కాగా మరో ముగ్గురు సహాయకులు. రవాణా మద్దతు, ఆహారం, ఆశ్రయం కల్పించడం వంటి పనులు చేస్తుంటారు. ఈ ఐదుగురిని ప్రశ్నించి శోధించగా ఉగ్రవాద సంస్థ అల్ బదర్ లెటర్ ప్యాడ్, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించింది. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.