లింగాపూర్లో నిరుపయోగంగా ‘ప్రగతి’ పనులు
రూ.లక్షల్లో నిధులు వృథా
ఐదు కిలోమీటర్ల దూరంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు
కారడవిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న తీరులో నిర్మాణాలు
బండ్ల బాట కంటే హీనంగా రోడ్డు
ములుగు, మార్చి 24(నమస్తే తెలంగాణ) : ప్రజలకు అన్ని సౌలతులు చేరువ కావాలని రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిని అమలు చేస్తున్నది. ఆహ్లాదం పంచేలా పార్కు, అంతిమ కష్టాలు తీర్చేలా శ్మశానవాటిక, చెత్తాచెదారాన్ని దూరం చేసేలా డంపింగ్ యార్డు ఇలా ప్రతిదీ చెంతనే ఉండాలని నిర్ణయించి ఆ మేరకు నిధులు కూడా కేటాయిస్తున్నది. కానీ, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. ఊరికి ఐదు కిలో మీటర్ల దూరాన కారడవిలో రాళ్లూరప్పల మధ్య, సరైన దారి కూడా లేని స్థలాల్లో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించ తలపెట్టి పనులను ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందాన వదిలేయడం విమర్శలకు తావిస్తున్నది.
ప్రజలకు పాలన చేరువ కావాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చిన్న పల్లెలను, తండాలను, గూడేలను, ఆమ్లెట్ గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్చింది. వీటిని అందంగా తీర్చిదిద్దేందుకు పల్లె ప్రగతిని చేపట్టి, నిధులు కూడా కేటాయిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలను, ప్రణాళికలను పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు, నిర్లక్ష్యం వహిస్తుండడంతో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్లో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. పల్లె ప్రగతి పనుల్లో ఏ ఒక్కటీ పూర్తి కాలేదు. 431మంది జనాభా కలిగిన ఈ జీపీ ఖాతాలో ప్రతి నెలా ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నది. జీపీ పాలకులు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్కు ఇంకా రూ.72వేలు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెలా విద్యుత్ బిల్లులు, జీపీ కార్మికుడి వేతనాన్ని మాత్రమే చెల్లిస్తూ వస్తున్నారు.
ఐదు కిలోమీటర్ల దూరంలో..
పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక వీలైనంత వర కు గ్రామ శివారులో నిర్మించాల్సి ఉన్నా లింగాపూ ర్లో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్ను ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని వాగుల అవతల ఐదు కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణ పనులు పూర్తయినా వినియోగంలోకి రాలే దు. శ్మశాన వాటిక పనులు పిల్లర్ల వరకు పూర్తయి స్లాబ్ కోసం సెంట్రింగ్ కొట్టి ఉంచారు. ఎండాకా లం ముగిసేలోపు కూడా వైకుంఠధామం పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. నిర్మాణ సామగ్రి ని తరలించేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవ డంతో పెద్ద సమస్యగా మారింది. ఇక ఊరికి పడ మర దిక్కున వెంకటాపూర్ మండల కేంద్రానికి నంది పహాడ్ మీదుగా వెళ్లే దారిలో ఐదు కిలో మీట ర్ల దూరంలో పల్లె ప్రకృతి వనం పనులు తూతూ మంత్రంగా చేపట్టారు. ఎకరం భూమిలో రాళ్లూ రప్పల నడుమ అరకొర పనులు చేసి అక్కడ క్కడా మొక్కలు నాటి వదిలేశారు. సంరక్షణ చర్య లు లేక, నీరందక ఎండాకాలంలో ఒక్క మొక్క కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇక వానకాలం వస్తే వైకుంఠధామానికి వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ దారిలో రెండు వాగులు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల ముందుచూపు లేని తనం తో వైకుంఠధామం నిరుపయోగంగా మారే ప్రమా దముంది.
ఉపయోగం లేని పనులతో నిధులు వృథా
ప్రజావసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టినా, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ల నిర్లక్ష్యపు ధోరణితో గ్రామంలో ఉపయోగం లేని పను లు చేపట్టి నిధులు వృథా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇస్తు న్న నిధులకు తోడు దాతల సహకారంతోనో ఇతర మార్గాల ద్వారానో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా ఒక శాఖ అధికారులు మరో శాఖపై నిందలు వేసుకుంటూ ఊరికి దూ రంగా అనవసరపు నిర్మాణాలు చేపట్టారు. వైకుంఠధామం వందశాతం నిరుపయోగమేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఐదు కిలో మీటర్ల దూరంలో పార్కు ఏర్పాటు చేస్తే ఎవ రు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు.