అహ్మదాబాద్: కరోనా మహమ్మారి కారణంగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పలు రాష్ట్రాల్లో చదువులు అటకెక్కాయి. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా అవి అరకొరగానే జరుగుతున్నాయి. మహమ్మారి ఉధృతి పూర్తిగా తగ్గకపోవడంతో ఆఫ్లైన్ తరగుతులు నిర్వహించడం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పదో తరగతి, 12 తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు పంపుతున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. గుజరాత్లో కూడా ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా, తాజాగా 12వ తరగతి (ఇంటర్ సెకండియర్) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసింగ్ చుడాసమా ఒక ప్రకటన చేశారు.