నేడు ప్రమాణస్వీకారం
గాంధీనగర్: గుజరాత్లో తదుపరి సీఎం పటేల్ వర్గం నుంచే ఉంటారన్న అంచనాలు నిజం అయ్యా యి. రాష్ట్ర కొత్త సీఎం గా భూపేంద్ర పటేల్ (59) ఎంపికయ్యారు. ఆదివారం గుజరాత్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర బీజేపీ తరఫున పరిశీలకులుగా నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపాణీ ప్రతిపాదించారు. దీనిని బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అనుభవం ఉన్న నేతకు సీఎం పదవి కట్టబెడతారని అంతా ఊహించారు. అయితే బీజేపీ అధిష్ఠానం మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. సోమవారం భూపేంద్ర ప్రమాణం చేయనున్నట్టు సమాచారం. 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్.. సివిల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశారు. మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్కు సన్నిహితులు.