అహ్మదాబాద్: గుజరాత్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు వెరైటీ బైక్ను తయారు చేశారు. పెట్రోల్తోపాటు విద్యుత్తో కూడా నడిచేలా దీనిని రూపొందించారు. రాజ్కోట్లోని వీవీపీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పెట్రోల్, విద్యుత్తో నడపగల మోటారు బైక్ను అభివృద్ధి చేశారు. ‘ప్రస్తుతం ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సమస్యలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఈ రెండు సమస్యలను అధిగమించేలా పెట్రోల్తోపాటు విద్యుత్తో నడిచే బైక్ను తయారు చేయాలన్న ఆలోచన మాకు వచ్చింది’ అని కాలేజీకి చెందిన మెకానికల్ డిపార్డ్మెంట్ డీన్ డాక్టర్ మణియర్ తెలిపారు. తమ ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన బైక్ను పెట్రోల్తోపాటు విద్యుత్ చార్జింగ్తోనూ నడపవచ్చని ఆయన వివరించారు.