తూప్రాన్ రూరల్,మే 3 : యాసంగిలో పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర కల్పిస్తుండటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకపోవడంతో రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతున్నది. ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నది. కరోనా నిబంధనలు పాటిస్తూ రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.తూప్రాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో తూప్రాన్, మనోహరాబాద్,యావాపూర్,నాగులపల్లిలో,ఐకేపీ సంఘాల ద్వారా ఇస్లాంపూర్, వెంకటరత్నాపూర్, మల్కాపూర్,ఘనపూర్, వెంకటాయపల్లిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది.
పీఏసీఎస్ సొసైటీల ద్వారా 33,217 బస్తాల ద్వారా 14,237 మంది రైతుల నుంచి 15,117 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు.ఐకేపీ సంఘా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి 764 మంది రైతులు పండించిన 53,981 బస్తాల ద్వారా 21,947 క్వింటాళ్ల వరిధాన్యాన్ని సేకరించారు.
దళారుల ప్రమేయం లేదు
దళారులు,మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసిమద్దతు ధర కల్పిస్తుంది. కరోనా విజృంభిస్నున్న స మయంలో సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారు. తూకంలో తేడాలు, మోసాలు లేకుం డా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
-సత్తయ్య, రైతు, తూప్రాన్
మద్దతు ధరను కల్పిస్తున్న ప్రభుత్వం
రై తులు పండించిన పంటలకు మద్దతు ధరను కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దళారులకు ధా న్యం విక్రయిస్తే తూకంలో తేడాలు, మోసాలకు పాల్పడుతారనే దూరదృష్టితో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.