లక్నో: ఉత్తర ప్రదేశ్కు చెందిన ఒక వరుడు, తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పలు ఎండ్ల బండ్లపై ఊరేగింపుగా పెండ్లికి వెళ్లారు. కుషరి గ్రామంలోని తన ఇంటి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్రీ బజార్లోని వివాహ వేదిక చేరుకోవడానికి ఎండ్ల బండ్లను వినియోగించారు. తమ పూర్వీకులు వివాహ ఉరేగింపు, వివాహాలు ఎలా జరుపుకునేవారో అన్నది ప్రజలకు తెలియజేసేందుకు ఎండ్ల బండ్లపై పెండ్లికి వెళ్లినట్లు వరుడు చోటే లాల్ తెలిపారు.