రాయ్పూర్: ఆన్లైన్ ద్వారా మద్యం విక్రయించాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం యోచిస్తున్నది. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మద్యం షాపులను మూసివేశారు. ఈ నేపథ్యంలో బిలాస్పూర్లో ఇటీవల కొందరు మద్యం ప్రియులు ఆల్కహాల్ కలిగిన హోమియోపతి మందు సేవించడంతో చనిపోయారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు గతంలో లాక్డౌన్లో మాదిరిగా ఆన్లైన్లో మద్యం అమ్మకాలు, డోర్ డెలివరీని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నదని మంత్రి కవాసి లఖ్మా వెల్లడించారు.