మీ సౌలభ్యం మేరకు చర్చలకు రండి.. రైతు నేతలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: రైతు నేతల సౌలభ్యం మేరకు చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద సుమారు నెల రోజులుగా నిరసనలు చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులకు గురువారం తాజాగా మరో లేఖ రాసింది. ఆరో విడత చర్చల తేదీ, సమయాన్ని రైతు నేతలే నిర్ణయించాలని కోరింది. వ్యవసాయ చట్టాల సవరణలకు బదులుగా ప్రభుత్వం మరో కొత్త ఎజెండాతో ముందుకు వచ్చే వరకు ఎలాంటి చర్చలు జరుపబోమని రైతు సంఘాలు బుధవారం స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ప్రతిపాదనతో లేఖ రాసింది. ‘ప్రభుత్వం, గౌరవంగా, బహిరంగ మనస్సుతో, అనేక రౌండ్ల చర్చలు జరిపింది. మీ సౌలభ్యం మేరకు తదుపరి రౌండ్ చర్చలు జరుపాలని ప్రతిపాదించింది’ అని అందులో పేర్కొంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగ్రవాల్ సంతకంలో కూడిన లేఖను రైతు సంఘాల నేతలకు పంపారు.
తాజావార్తలు
- నానబెట్టిన నల్ల శనగలు తినొచ్చా.. తింటే ఏంటి లాభం.?
- సీఎంఆర్ సంస్థను రద్దు చేయాలి
- ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్కు ఐదో స్థానం
- స్టంట్ చేస్తుండగా సంపూర్ణేశ్కు ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్