ఢిల్లీ : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) సర్టిఫికేట్, సెమిస్టర్ ఆధారిత ప్రొగ్రామ్స్కు మినహా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రామ్లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. అభ్యర్థులు ignouiop.samarth.edu.in. ను సందర్శించి తమ దరఖాస్తు ఫారాలను సమర్పించవచ్చు. జనవరి 2021 సెషన్కు ఇగ్నో మొత్తం 16 ప్రొగ్రామ్స్ను ఆన్లైన్ ద్వారా ఆఫర్ చేసింది. ఇగ్నో వెబ్సైట్లోని ప్రొగ్రామ్ విభాగంలో కోర్సుల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఇగ్నో ఇటీవలే తన 34వ కాన్వోకేషన్ను జరుపుకుంది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ ప్రసంగించారు. కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు 2,37,844 డిగ్రీ, డిప్లొమో, వివిధ ప్రొగ్రామ్ల సర్టిఫికెట్లు అందజేశారు.