హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన రెండేండ్ల బాలుడు తెల్లవారే సరికి ఇంటిపై నీటి ట్యాంకులో శవమై కనిపించాడు. రాత్రి తమ వద్దే నిద్రించిన బాలుడు తెల్లవారుజామున 2 గంటల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఇంటిని అణువణువునా గాలించారు. చివరకు ఇంటిపైకప్పుపై ఉన్న నీటి ట్యాంకును పరిశీలించగా బాలుడి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసిన పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా.? లేక హత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.