న్యూఢిల్లీ: దేశంలోని అసంఘటిత కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యలను విని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇ-శ్రామ్’ పోర్టల్ను (e-Shram Portal) ప్రారంభించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ పోర్టల్ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కార్మిక, ఉపాధి, పెట్రోలియం అండ్ సహజ వాయువుల మంత్రి రామేశ్వర్ తెలి సమక్షంలో అందజేశారు. అంతకుముందు ఆగస్టు 24 న ఇ-శ్రామ్ పోర్టల్ లోగోను భూపేందర్ యాదవ్ ఆవిష్కరించారు.
ఇ-శ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకున్న తర్వాత అసంఘటిత కార్మికులు ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల కోసం విడిగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. 12 అంకెల యూఏఎన్ కలిగిన ఇ-శ్రామ్ కార్డ్ దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. ఈ పోర్టల్లో పేర్ల నమోదు కార్యక్రమం కేంద్ర కార్మిక శాఖ, రాష్ట్రాల్లోని కార్మిక శాఖ, ట్రేడ్ యూనియన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలతోపాటు వ్యక్తిగత వివరాలను అందజేయడం ద్వారా సభ్యత్వం పొందవచ్చు. ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కోరుకునే కార్మికుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు, సమస్యలను పరిష్కరించడానికి జాతీయ టోల్ ఫ్రీ నంబర్ 14434 ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
‘దేశవ్యాప్తంగా 38 కోట్లకు పైగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సు కోసం ఈ పోర్టల్ను తీసుకొచ్చాం. ఈ పోర్టల్ కేవలం రిజిస్ట్రేషన్ కోసమే కాకుండా అసంఘటి రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సామాజిక భద్రతా పథకాలు అందేలా చూస్తుంది. ఈ పోర్టల్ ద్వారా పేర్లను నమోదు చేసుకున్న కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం పట్ల ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
ఇటలీ విమానంలో మంటలు.. ప్రయాణికులు సురక్షితం
రాణె తల నరికి తెస్తే 51 లక్షల రివార్డ్ : విశ్వ హిందూ సేన
సాంకేతిక అంతరాల్లేని అంతర్జాల విద్య రావాలి: వెంకయ్యనాయుడు
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజయ్ కుమార్
7,200 ఏండ్ల క్రితం మహిళ శరీరంలో డీఎన్ఏ గుర్తింపు
త్వరలో గూగుల్ పే ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్
సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..