న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణలో కేంద్ర ప్రభత్వం అనుసరిస్తున్న తీరును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఐటీ విభాగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ తప్పుపట్టారు. ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్ సాయంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులపై నిఘా వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. ఈ వారం చర్చించాల్సిన అంశాల ఎజెండాలో ఆ విషయాన్ని చేర్చలేదని ఆయన విమర్శించారు.
అంతేగాక, దేశంలో ఇంధన ధరల పెరుగుదల, కొవిడ్ మహమ్మారిని కట్టడి చేస్తున్న తీరు, వాక్సినేషన్ విధానం తదితర అంశాలపై లోక్సభలో చర్చించడానికి ప్రభత్వం సుముఖంగా లేదని ఆయన ఆరోపించారు.