సిమ్లా : సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.వీ. ప్రసాద్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. వారి మరణ వార్త తనకు దుఃఖాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎస్.వీ. ప్రసాద్ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఉమ్మడి ఏపీలో అనేక ప్రభుత్వాలలో ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా సేవలందించారన్నారు.
చాలా నియమబద్ధంగా అభివృద్ధికి ప్రాముఖ్యతనిస్తూ, సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో, నిష్పక్షపాతంగా ఉండేవారని కొనియాడారు. ఎస్.వీ. ప్రసాద్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. వారి ఆత్మకు శాంతిని చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.