దేవరుప్పుల, మే 4: జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్కు మండలకేంద్రంలోని బాలయేసు ఆంగ్ల ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని సోలిపురం స్ఫూర్తి ఎంపికైనట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ 9న జరిగిన ఆన్లైన్ పోటీల్లో విద్యార్థిని సోలిపురం స్షూర్తి ఎకో ఫ్రెండ్లీ హోం విత్ సెల్ఫ్ కూలింగ్ సోలార్ రూఫ్ లైల్స్ అండ్ వాటర్లెస్ యూరినల్ అనే ఎగ్జిబిట్ను ప్రదర్శించగా రాష్ట్ర స్థాయిలో రెండవ స్ధానం రాగా జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్లు ఆయన తెలి పారు. ఈ విషయం ఎస్సీ ఈఆర్టీ పాఠశాలకు తెలియజేసి నట్లు ఆయన తెలిపారు. కాగా విద్యార్థిని స్ఫూర్తిని పాఠశాలలో జరిగిన ఓ కార్య క్రమంలో పాఠశాల యాజమాన్యం సన్మానిం చింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాకూ బ్, విజయలక్ష్మి, భాస్కర్, ఖాజా, రమా దేవి, జిమ్మీ, యాదయ్య, అలీ, మహేశ్, నరేశ్, ఉపేం దర్ తదితరులు ఉన్నారు.