ముంబై :నిన్నటివరకు లాభాల్లో కనిపించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్లు కోల్పోయి 49,034 వద్ద కొనసాగుతుండగా… నిఫ్టీ 141 పాయింట్లు కిందకు దిగి 14,800 వద్ద ట్రేడ్ అవుతున్నది. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెడ్డీఎఫ్సీ జంట షేర్లు, ఓన్జీసీ,హెచ్యూఎల్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ 30 జాబితాలో వవర్ గ్రిడ్, సన్ ఫార్మా మినహా దాదాపు అన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.