బన్సీలాల్పేట్/బేగంపేట్, జూన్ 29 : సనత్నగర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బన్సీలాల్పేట్, బేగంపేట్ డివిజన్లో రూ. కోటి 30 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా బన్సీలాల్పేట్లోని సీ-క్లాస్లో రూ.35 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ కె.హేమలతతో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ.11 లక్షలతో నిర్మించిన నవోదయ కమ్యూనిటీ హాలు, రూ.16.50 లక్షలతో ఎంసీహెచ్ క్వార్టర్స్ ముస్లిం బస్తీలో నిర్మించిన కమ్యూనిటీ హాలు, రూ.30.20 లక్షలతో బీజేఆర్నగర్ బస్తీలో నిర్మించిన కమ్యూనిటీ హాలును మంత్రి ప్రారంభించారు.
ఓల్డ్ పాటిగడ్డలో రూ.8.5 లక్షలతో ఎన్బీటీ నగర్ వడ్డెర బస్తీలో రూ.8.5 లక్షలతో, ఎయిర్లైన్స్ కాలనీలో రూ. ఏడు లక్షలతో, భగవంతాపూర్లో రూ.6.40 లక్షలతో చేపట్టనున్న సివరేజీ పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ టి.మహేశ్వరితో కలిసి ప్రారంభించారు. భగవంతాపూర్ కాలనీవాసులు కాలనీ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని, ఏకాభిప్రాయానికి వస్తే ఖాళీ స్థలంలో మల్టీ పర్పస్ ఫంక్షన్హాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, జీహెచ్ఎంసీ బేగంపేట్ డీసీ ముకుందరెడ్డి, ఈఈ శివానంద్, డీఈ ఆంజనేయులు, జలమండలి జీఎం రమణారెడ్డి, డీజీఎం వెంకట్రావు, విద్యుత్ ఏఈ రవీందర్ స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.