ఇప్పటివరకు డోర్ డెలివరీ అంటే మనుషులు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పనికి కూడా రోబోలను వాడేస్తున్నారు. సింగపూర్ కి చెందిన ఓ కంపెనీ ఇలాంటి రోబోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ట్రయల్ రన్ లో ఈ రోబోలు బిజీగా ఉన్నాయి.
వీటికి పేరుకూడా ఉందండోయ్. కామెల్లో అనగానే యస్ బాస్ అంటూ రెడీ అయిపోతాయి. ఇందులో 20కేజీల వరకు స్పేస్ ఉంటుంది. అందులో మీరు ఏమి ఆర్డర్ చేశారో వాటిని నింపుకొని క్షణాల్లో మీ ఇంటి తలుపు తడుతుంది కామెల్లో.
మీరు సరుకులు తీసుకోగానే రోబోలు వాటంతట అవే క్లీన్ అయిపోతాయి. అల్ట్రావైలెట్ లైట్ ద్వారా వైరస్ లను చంపేసి శుభ్రంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ రోబోలు ఒక్కొక్కటి రోజుకు నాలుగైదు డోర్ డెలివరీలు చేస్తున్నాయి. కంపెనీ 700 వరకు రోబోలను ఈ డోర్ డెలివరీకి వాడుతున్నారు.