న్యూఢిల్లీ : సీబీఎస్ఈ బోర్డు పరీక్షను రద్దు చేసిన తర్వాత నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్), జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్) మెయిన్స్ వంటి పోటీ పరీక్షలను రద్దు చేయాలనే ఒత్తిడిలో ప్రభుత్వం ఉన్నది. అయితే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలు రద్దు కావని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. కరోనా ఇన్ఫెక్షన్ పరిస్థితి మరింతగా మెరుగుపడగానే వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. నీట్, జేఈఈ మెయిన్స్కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను వచ్చే వారం నాటికి విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్నీ సూచించింది.
విద్యా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, నీట్, జేఈఈ మెయిన్లకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. దాంతో ఈ పరీక్షలకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు జరగలేదు. అంతర్గత మదింపు ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రవేశ పరీక్ష లేకుండా ఈ ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో విద్యార్థుల ఎంపిక సరైనది కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ప్రతిపాదిత ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ ఏడాది నుంచే నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. ఇది జాతీయ విద్యా విధానంలో సిఫార్సు చేయబడింది. కొత్త విద్యా సెషన్ నుంచి ఈ సిఫార్సును అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వీటిని అమలు చేయడం కొంత ఆలస్యమైంది.
జెరూసలేంలో అల్ జజీరా మహిళా జర్నలిస్ట్ అరెస్ట్
WWDC 2021: రేపటి నుంచి ఆపిల్ ఈవెంట్ ప్రారంభం
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..
ఆఫ్ఘాన్లో బాంబు పేలుడు : 11 మంది దుర్మరణం
అదే స్వరం : కొవిడ్కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
భాషా వివాదం : ఈ దవాఖానలో మలయాళంలో మాట్లాడొద్దు..
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..