ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ డేంజర్లో పడ్డాడు. కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ సీజన్ తొలి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనీకి మ్యాచ్ రిఫరీ 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే కదా.
ఐపీఎల్ కొత్త రూల్స్ ప్రకారం టీమ్స్ కచ్చితంగా 90 నిమిషాల్లోపు 20 ఓవర్లు పూర్తి చేయాలి. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు స్పష్టంగా చెప్పింది. తొలిసారి ఆలస్యం చేస్తే 12 లక్షల జరిమానా విధిస్తారు. ఆ తర్వాత రెండు మ్యాచ్లలోపు మరోసారి అదే తప్పిదం రిపీట్ చేస్తే కెప్టెన్పై రెండు నుంచి నాలుగు మ్యాచ్ల నిషేధం విధిస్తారు.
ఈ నిర్ణయం మ్యాచ్ రిఫరీ చేతుల్లో ఉంటుంది. ఇప్పటికే ధోనీ ఒకసారి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు శుక్రవారం జరగబోయే మ్యాచ్లో కూడా సీఎస్కే స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ధోనీపై నిషేధం తప్పదు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో గెలవడం ఒక్కటే కాదు.. ఓవర్లను నిర్ణీత సమయంలోపు ముగించడమూ ధోనీకి ముఖ్యమే.