ఢిల్లీ, జూన్ 14: ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, డోమినోస్ వంటి సంస్థలలో డాటా ఉల్లంఘనల ప్రభావంపై మీడియాలో వచ్చిన కథనాలపై కేంద్ర సర్కారు స్పందించింది. ఈ-మెయిల్ అకౌంట్లను, ఎన్ ఐసిఈ-మెయిల్స్ పాస్వర్డ్స్ ను హ్యాకర్లు బహిర్గతం చేశారని ఆయా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) నిర్వహించే ఈ -మెయిల్ వ్యవస్థలో ఎటువంటి సైబర్ ఉల్లంఘనలు జరగలేదని భారత ప్రభుత్వం తెలిపింది.
ఈ -మెయిల్ వ్యవస్థ పూర్తి సురక్షితం, భద్రంగా ఉన్నదని వెల్లడించింది.
ఈ -పోర్టళ్ళపై తమ ప్రభుత్వ ఈ-మెయిల్ అడ్రెస్ ఉపయోగించి నమోదు చేసుకుని, ప్రభుత్వ ఈ -మెయిల్ అకౌంట్కు ఉపయోగించే పాస్వర్డ్ నే ఉపయోగిస్తే తప్ప బయటి పోర్టళ్ళ సైబర్ భద్రత ఉల్లంఘన అనేది ప్రభుత్వ ఇమెయిల్ సేవలను ప్రభావవితం చేయదని చెప్పింది.
ఎన్ఐసి ఇమెయిల్ వ్యవస్థ రెండు కారకాల ప్రామాణీకరణ, 90 రోజుల్లో పాస్ వర్డ్ మార్పు వంటి పలు భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, ఎన్ఐసి ఇమెయిల్కు పాస్ వర్డ్ మార్పుకు మొబైల్ ఒటిపి అవసరం. ఒకవేళ మొబైల్ ఒటిపి తప్పయితే, పాస్వర్డ్ మార్పు సాధ్యం కాదు. ఎన్ఐసి ఈ-మెయిల్ను ఉపయోగించే ఫిషింగ్ ప్రయత్నాన్ని దేనినైనా ఎన్ఐసి నివారించగలదు.