శాయంపేట, జూన్ 10 : మండలంలోని మైలారంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధ్దిదారులపై గురువారం ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టా రు. 2004లో ఇందిరమ్మ పథకంలో ఇండ్లు పొందిన 140 మంది లబ్ధ్దిదారులు ఇండ్లు కట్టుకో కుండానే డబ్బులు తీసుకున్నట్లు పేర్కొన్నా రు. ఈ క్రమంలో గతంలోనే సీఐడీ ఆధ్వర్యంలో విచారణ చేశారన్నా రు. ఈ క్రమంలో మళ్లీ విచారణ చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు వివరించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ప్రత్యేక విచారణ చేసినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ హేమానాయక్ తెలి పారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినందున ఆర్ఆర్ యాక్టు కింద భూము లు, ఇండ్లను జప్తు చేసి, నోటీ సులు ఇస్తున్నట్లు తెలిపారు. వీఆర్వోలు, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.