న్యూఢిల్లీ: ఎట్టకేలకు వారం రోజుల ప్రతిష్టంభన తర్వాత సూయజ్ కాలువలో చిక్కుకున్న ఎంవీ ఎవర్గివెన్ నౌక సోమవారం ముందుకు కదిలింది. మార్చి 23 నుంచి 28 వరకు సూయజ్ కాలువలో ఈ నౌక చిక్కుకోవడంతో ఈజిప్ట్ అధికారులు.. నౌక సిబ్బంది బాధలు ఒకెత్తు.
400 మీటర్ల భారీ నౌక చిక్కుకోవడంతో మరో ఇబ్బంది తలెత్తింది. ఏడు రోజుల పాటు సూయజ్ కాలువలో నౌక నిలిచిపోవడంతో ప్రపంచ వాణిజ్యం 54 బిలియన్ల డాలర్ల మేరకు నష్టపోయిందని అంచనా.. భారతదేశం కూడా వందల కోట్ల మేరకు నష్టపోయిందని తెలుస్తున్నది.
పలు దేశాలతో అనుసంధానమైన సూయజ్ కాలువ.. తూర్పు, పశ్చిమ ప్రాంత దేశాలకు వారధి.. అనూహ్యంగా భారీ నౌక చిక్కుకోవడంతో దానికి ఇరువైపులా నౌకలన్నీ నిలిచిపోయాయి.
అధికారిక గణాంకాల ప్రకారం నిమిషానికి 6.7 మిలియన్ల డాలర్ల వ్యాపారం సాగుతుంది. అంటే సూయజ్ కాలువ మీదుగా గంటకు 40 కోట్ల డాలర్ల బిజినెస్ జరుగుతుందన్న మాట.
ఈస్ట్ నుంచి వెస్ట్కు చమురు, రిఫైన్డ్ ఫ్యూయల్, ఆహార, ఇతర వస్తువులు, సరుకులు సరఫరా కావాలంటే సూయజ్ కాలువే దిక్కు.
సూయజ్ కాలువలో నౌక నిలిచిపోవడంతో రమారమీ గ్లోబల్ ట్రేడ్.. 12 శాతం మూల్యం చెల్లించుకుందని తెలుస్తున్నది. సూయజ్ కాలువ బ్లాకేజీ మరికొన్ని రోజులు కొనసాగితే యావత్ ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది.
సూయెజ్ కాలువ సంస్థ చైర్మన్ ఒసామా రాబీ మాటల్లో చెప్పాలంటే రోజుకు నౌకల రవాణా నిలిచిపోవడంతో రోజుకు 14-15 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.
ఎంవీ ఎవర్గివిన్ నౌక.. సూయజ్ కాలువలో చిక్కుకోవడం వల్ల నిర్దేశిత గడువులోగా సరుకులు రాకపోవడంతో వివిధ దేశాల్లోని ఆఫ్ లైన్, ఆన్లైన్ రిటైల్ వ్యాపారులకు మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్.. 87 శాతం సంస్థల మాట ఇదే
అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!