కోల్కతా: పశ్చిమబెంగాల్లో ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్లు బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే విశ్వజత్ దాస్ కూడా పార్టీని వీడటంతో.. బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఎమ్మెల్యే విశ్వజిత్ దాస్తోపాటు బీజేపీ కౌన్సిలర్ మనొతోస్ నాథ్ కూడా బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.
ఈ సందర్భంగా విశ్వజిత్ దాస్ మాట్లాడుతూ.. బీజేపీలో కొన్ని జరుగ కూడని మార్పులు జరిగాయని, ఈ విషయంలో పార్టీలో అపార్థాలు పొడసూపాయని, అందుకే తాను ఆ పార్టీని వీడి సొంత గూటికి చేరానని చెప్పారు. విశ్వజిత్ దాస్తో కలిపి గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం తృణమూల్లో చేరిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే ముకుల్ రాయ్ బీజేపీని వీడగా, సోమవారం విష్ణుపూర్ ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ కూడా ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.