హైదరాబాద్: హైదరాబాద్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం నగరంలో 22 క్యారట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ.44,310 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. అదేవిధంగా నగరంలో 24 క్యారట్ బంగారం ధర ఇవాళ రూ.48,340గా ఉన్నది. అయితే హైదరాబాద్లో వెండి ధర మాత్రం మండిపోతున్నది. కిలో వెండి ఏకంగా రూ.75,000 వేల పలుకుతున్నది. ఇక ఢిల్లీలోనూ బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి.
తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.69 పెరిగి రూ.46,408కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం 24 క్యారట్ బంగారం రూ.46,339 వద్ద ముగిసింది. కిలో వెండి ధర కూడా ఇవాళ రూ.251 పెరిగి రూ.69,035కు చేరుకుంది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,784 వద్ద ఉన్నది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,793 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.60 అమెరికన్ డాలర్లు పలికింది.