న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.110 పెరిగి రూ.46,396కు పెరిగింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,286 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా పెరుగడమే ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా ఇవాళ కిలో వెండి ధర రూ.324 పెరిగి రూ.66,864కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,540 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,783 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.94 అమెరికన్ డాలర్లు పలికింది.