పనాజీ : కరోనా కట్టడికి అమల్లో ఉన్న లాక్డౌన్ ను మే 31 వరకూ పొడిగించినట్టు గోవా ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. కేబినెట్ భేటీ అనంతరం గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ ను మే 31 వరకూ కొనసాగించాలని నిర్ణయించామన్నారు.
నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు, లిక్కర్ షాపులు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ తెరిచిఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. రెస్టారెంట్ కిచెన్లు, మందుల షాపులు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకూ అనుమతిస్తారు. ఇక గోవాలో గడిచిన 24 గంటల్లో 1582 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.