హైదరాబాద్ : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి. ప్రజలను దీని కోరల్లో చిక్కుకోకుండా కాపాడాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో మంత్రి నేడు టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నివారణ విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు హాస్పిటల్స్ లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ఫీవర్ సర్వే ద్వారా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరోనాపై అవగాహన కల్పించాలి. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని ఆమె సూచించారు.
సీఎం కేసీ ఆర్నిత్యం కరోనాపై సమీక్ష చేస్తున్న నేపథ్యంలో జిల్లాల్లో ఎప్పటికప్పుడు కరోనా కేసులను, పురోగతి వివరాలను సమర్పించాలన్నారు. కరోనాపై ప్రజల్లో ధైర్యం కల్పిస్తూ వారికి అండగా నిలవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి