న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం జీ మెయిల్ (Gmail) సేవలు నిలిచిపోయాయి. చాలా మంది మెయిల్ పంపలేకపోవడం, రిసీవ్ చేసుకోలేకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఈ దీనిపై గూగుల్ ఎలాంటి ప్రకణ చేయలేదు. డౌన్డెటెక్టర్ వెబ్సైట్ ప్రకారం.. 68శాతం మంది వినియోగదారులు జీ మెయిల్ వెబ్సైట్లో సమస్య ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. మరో 18 శాతం సర్వర్ కనెక్షన్లో సమస్య ఉందని, 14 శాతం మంది లాగిన్లో సమస్య ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.
భారత్తో పాటు పలు దేశాలకు చెందిన వినియోగదారులు సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. జీ మెయిల్ను యాక్సెస్ చేయలేకపోవడంతో పాటు మెయిల్ సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నారు. ట్విట్టర్లోనూ జీ మెయిల్ సర్వర్ డౌన్ హ్యాట్ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా యాప్లు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు దాదాపు ఎనిమిది గంటలు స్తంభించిన విషయం తెలిసిందే.