ముంబై: తమ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించడంపై బాలీవుడ్ నటి తాప్సీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్ తొలిసారి స్పందించారు. ఐటీ దాడులతో తమ స్ఫూర్తిని దెబ్బతీయలేరంటూ సోషల్ మీడియా వేదికగా సంకేతాలిచ్చారు. వారిద్దరూ కలిసి పనిచేస్తున్న ‘దొబారా’ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభమైనట్టు కశ్యప్ శనివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘ద్వేషించేవారికి ప్రేమతో’ అనే వ్యాఖ్యతో ఇద్దరూ విజయసంకేతం చూపుతున్న ఫొటోను పోస్ట్చేశారు.