చండీఘడ్ : హర్యానాలో శుక్రవారం సాయంత్రం నుంచి అన్ని దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర కార్యక్రమాలు మినహా అన్ని సమావేశాలపై నిషేధం విధించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో కఠిన నియంత్రణలను చేపట్టామని ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు.
అత్యవసర కార్యక్రమాలకు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆయన గురువారం ట్వీట్ చేశారు. వ్యవసాయ చట్టాలపై రాష్ట్ర సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులకు కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ పై రైతు నేతలతో ఆరోగ్య శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.