జోధ్పూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు, ట్రక్కు ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. జోధ్పూర్ జిల్లా బాప్ ప్రాంతంలోని గాన గ్రామ సమీపంలో జాతీయ రహదారి 11పై శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ఢిల్లీ నుంచి రాజస్థాన్లోకి జైసల్మేర్ వెళ్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులున్నారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.