ఇండోర్, జూన్ 21: ప్రజల్లో కరోనా టీకాపై అవగాహన పెంచుతూ, వారిని వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలతో పాటు పలువురు వ్యాపారులూ ముందుకు వస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలకు బస్సు టికెట్లు (వన్ టైమ్ జర్నీ) ఉచితంగా ఇస్తామని ప్రైమ్ రూట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇక షాపింగ్ మాల్ ఓనర్స్ కూడా టీకా వేసుకున్న ప్రజలకు సెల్ఫీ స్టిక్లు ఉచితంగా అందజేస్తున్నారు. లక్కీ డ్రా ఏర్పాటుచేసి అందులో గెలుపొందినవారికి రిఫ్రిజరేటర్లు, ఇతర విలువైన బహుమతులు అందజేయనున్నట్టు ఇండోర్లోని మూడు షాపింగ్ మాల్స్ ఓనర్స్ ప్రకటించారు.